బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
battularamakrishnagadarada@gmail.com , 91-9384999999 , 94827 99999.

బత్తుల బలరామకృష్ణ గారు గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో బత్తుల గంగారావు, శ్రీమతి గోవిందమ్మ దంపతులకు జన్మించినారు. వారి విద్యాభ్యాసం హైస్కూల్ వరకూ గాదరాడ గ్రామంలో జరిగింది. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయ పనులలో వారి తండ్రిగారికి సహాయంగా ఉండి, వ్యవసాయం చేసినానరు. ఆ తరువాత విజయవాడలో ఒక ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరి, అంచెలంచలుగా ఎదిగి, బ్రాంచ్ మేనేజర్ స్థాయి వరకూ వెళ్ళినారు. అదే సమయంలో డిగ్రీని కరస్పాండెన్స్ ద్వారా అభ్యసించినారు. 1999వ సంవత్సరంలో ఉద్యోగం మానేసి, స్వంతంగా వ్యాపారం ప్రారంభించినారు.
వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగి, మొదట జిల్లా స్థాయిలోను, తరువాత రాష్ట్ర స్థాయిలోను, ఆ తరువాత దేశం నలుమూలలా తమ వ్యాపారాన్ని విస్తరింపచేసి, వందల కోట్ల టర్నోవర్ తో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తనకు తాను ప్రత్యేకత చాటుకున్నారు.
తన పుట్టిన గడ్డకు ఏదైనా సేవ చేయాలనే మంచి ధృక్పథంతో 2012వ సంవత్సరములో నిర్ణయించుకొని, ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా పేద విద్యార్థులకు విద్య, నిరుపేదలకు వైద్యం, గ్రామాల్లో త్రాగునీరు అందించడం మరియు వృద్ధులకు, వితంతువులకు అవసరమైన రీతిలో ఆర్థికంగా (ప్రత్యక్షంగా, పరోక్షంగా) సేవలు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యాక్రమములన్నింటిని వారి సతీమణీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు.
అదేవిధంగా వైద్యం నిమిత్తం అనుభవజ్ఞులైన వైద్యులచే మెడికల్ క్యాంపులకు ఏర్పాటు చేయించి, అన్నిరకముల వైద్య పరీక్షలు చేయించి, అవసరమైతే మందులు కూడా ఉచితంగా ఇప్పించడంతో పాటు అత్యవసరమైతే తమ స్వంత ఖర్చులతో ఆపరేషన్లు చేయించడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, వితంతువులకు, అంగవైకల్యం గల వారికి తగిన రీతిలో ఆర్ధికంగా (ప్రత్యక్షంగా, పరోక్షంగా) వీలైనంత వరకూ వారికి సేవలు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి, రక్త నిధిని పెంచి, అత్యవసరమైన వారికి ఆ రక్తాన్ని అందించడం, పేద విద్యార్థులకు బుక్స్, పెన్స్ అందించడం, మరియు ఉన్నత చదువులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అంతే కాకుండా సుమారు 50 వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశములు కల్పించినారు. యువతకు చిన్న, చిన్న వ్యాపారాలు స్థాపించుకొనుటకు అవసరమైన ఆర్థికపరమైన సహాయములు అందించి, వారికి అన్నింట్లో మార్గనిర్దేశకులైనారు.
ప్రతీ ఒక్కరికి మానసిక ప్రశాంతత ఉండాలన్న ఉద్దేశ్యంతో ద్యాన పిరమిడను స్థాపించి, మెడిటేషన్/ యోగా నేర్పించడం, అదేవిధంగా 54 హిందూ దేవాలయములు నిర్మంచి, మానవ జాతిని ఆధ్యాత్మిక బావంతో వ్యసనాలకు దూరంగా ఉండి సాంప్రదాయ పద్ధతులలో జీవించుట కొరకు ఏర్పాట్లు చేసినారు. అంతే కాకుండా, 2015 సంవత్సరంలో ఉచిత నిత్య అన్నదానం ఏర్పాటు చేసి, వచ్చినవారందరికి అన్నదానం నిర్విరామంగా చేస్తున్నారు.
ఒక హిందువులకే కాకుండా క్రైస్తవులకు చలు, ముస్లింలకు మసీన్లు నిర్మించినారు. కొన్నింటికి ఆర్థికంగా వారి వంతు సహాయ పడుతుంటారు. జాతీయ నాయకుల జయంతులు, వర్గంతులు, పండుగలు, పర్వదినములు పురష్కరించుకొని, పేదలకు వస్త్రాలు, దుప్పట్లు, పండ్లు మరియు ఆర్ధిక సహాయం చేస్తుంటారు.
పేదింటి ఆడపడుచులకు వివాహాల విషయంలో ఆర్థికంగా సహాయం చేయడం, జీవనోపాధి కోల్పోయిన వారికి ధన, వస్తు సామాగ్రిని అందించడం, అభాగ్యులకు తగిన రీతిలో సహాయపడడం, అనాధ శవాలకు అంత్యక్రియలు జరిపించడం, యాక్సిడెంట్లు అయితే వారికి వైద్య సేవలు ఏర్పాటు చేయడం, పకృతి వైపరిత్యాలలో ప్రజలకు అండగా ఉండడం, లోక కళ్యాణార్థం యజ్ఞాలు, యాగాలు, కళ్యాణాలు, సనాతన ధర్మం ప్రకారం చేయించడం, మొక్కలు నాటించడం, కుల, మత, వర్ల, వర్గ, వయో భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికి ఏ సమయంలోనైనా, మంచి - చెడూ, వెనక- ముందూ చూడకుండా సేవ చేయడమే మహా భాగ్యమని భావించే మహోన్నత వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణగారు.
బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
+91-93849 99999 +91-94827 99999